పింక్ టెస్ట్ : ఈడెన్లో సీనియర్ల సందడి..
పొట్టి క్రికెట్ వచ్చాక కష్టాల్లో కూరుకుపోయిన టెస్ట్ క్రికెట్ స్థాయి పెంచాలన్న సంకల్పంతో 2015లో డే అండ్ నైట్ టెస్టులకు ఐసీసీ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు డే/నైట్ టెస్టులు ఆడేందుకు భారత్ టీం ఇంట్రస్ట్ చూపించలేదు. కానీ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పింక్ టెస్ట్ ఆడాలని దాదా ప్రతిపాదించడం..అందుకు సారథి కోహ్లీ యస్ అనడం చకచకా జరిగిపోయాయి. అందుకు దాదా ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. కోల్కతా […]
పొట్టి క్రికెట్ వచ్చాక కష్టాల్లో కూరుకుపోయిన టెస్ట్ క్రికెట్ స్థాయి పెంచాలన్న సంకల్పంతో 2015లో డే అండ్ నైట్ టెస్టులకు ఐసీసీ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు డే/నైట్ టెస్టులు ఆడేందుకు భారత్ టీం ఇంట్రస్ట్ చూపించలేదు. కానీ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పింక్ టెస్ట్ ఆడాలని దాదా ప్రతిపాదించడం..అందుకు సారథి కోహ్లీ యస్ అనడం చకచకా జరిగిపోయాయి. అందుకు దాదా ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. కోల్కతా సిటీ మొత్తం పింక్ కలర్ సంతరించుకుంది.
అనుకున్న రోజు రానే వచ్చింది. పింక్ బాల్తో ఈడెన్లో మ్యాచ్ ప్రారంభమైంది. టీం ఇండియా తొలిసారిగా బంగ్లాదేశ్తో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఈడెన్ గ్రౌండ్లోకి దిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ సారథి మొమినల్ హఖ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పింక్ బంతితో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 60 పరుగులకే బంగ్లా జట్టు 6 వికెట్లు కొల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ ప్రకటించేసరికి బంగ్లాదేశ్ స్కోరు 73/6 . అయితే లంచ్ బ్రేక్ సమయంలో ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ ద్రవిడ్, గంగూలీ, సచిన్, లక్ష్మణ్లతో గ్రౌండ్లో ఓ చిన్న టాక్ షో ప్లాన్ చేసింది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్.
అయితే మ్యాచ్ హాజరైన ద్రవిడ్, గంగూలీ గ్రౌండ్లోకి మాత్రం రాలేదు. ఎందుకంటే గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్గా, ద్రవిడ్ భారత ‘ఏ’ టీం కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారు కాస్త దూరంగా ఉండిపోయారు. ఇక వారి ప్లేసుల్లో కుంబ్లే, హర్బజన్ రంగంలోకి దిగారు. మాజీ క్రికెటర్ల సరదా సంభాషణలు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి.