పత్తిచేనులో కూలిన ట్రైనీ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
వికారాబాద్ జిల్లాలో ఓ ట్రైనీ విమానం కుప్పకూలిపోయింది. బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం.. కాసేపటికే బంట్వారం మండలం సుల్తాన్పూర్ గ్రామ సమీపంలోని ఓ పత్తి చేనులో కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందకున్న వైమానిక అధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు. ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
వికారాబాద్ జిల్లాలో ఓ ట్రైనీ విమానం కుప్పకూలిపోయింది. బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం.. కాసేపటికే బంట్వారం మండలం సుల్తాన్పూర్ గ్రామ సమీపంలోని ఓ పత్తి చేనులో కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందకున్న వైమానిక అధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు. ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.