uppula Raju |
Updated on: May 14, 2022 | 6:26 AM
ప్రపంచంలో ప్రమాదకర అడవులు చాలా ఉన్నాయి. ఇక్కడ జరిగే వింత సంఘటనలు అందరని భయాందోళనకు గురిచేస్తాయి. ట్రాన్సిల్వేనియాలో 700 ఎకరాల విస్తీర్ణంలో హోయా బైకు అనే ఫారెస్ట్ ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన అడవులలో ఒకటి.
ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని అందుకే ఇక్కడికి వెళ్లినవారు తిరిగి రాలేకపోతున్నారని కొంతమంది చెబుతున్నారు. ఈ అడవిలోకి వెళ్లిన తర్వాత వందలాది మంది రహస్యంగా అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకు వారి జాడ కనుగొనలేదు.
ఈ అడవిలో 200 గొర్రెలతో పాటు ఒక గొర్రెల కాపరి తప్పిపోయిన కథ కూడా ఉంది. ఇది కాకుండా ఇక్కడకు వచ్చే కొంతమంది పర్యాటకులు ఇక్కడ కొన్ని అతీంద్రియ వస్తువులను చూడటం గురించి ప్రస్తావించారు.
ఇక్కడ 15వ శతాబ్దంలో ఒక మహిళ తన జేబులో ఒక నాణెంతో వచ్చి అదృశ్యమైంది. చాలా ఏళ్ల తర్వాత అదే నాణెం జేబులో పెట్టుకుని అడవి నుంచి తిరిగి వచ్చింది. స్థానికుల ప్రకారం అడవి లోపలికి ఎవరైనా చేరుకోగానే అకస్మాత్తుగా చర్మంపై భయంకరమైన దద్దుర్లు, తలనొప్పి సమస్యలు ఏర్పడుతాయని చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో ఒక గొర్రెల కాపరి కనిపించకుండా పోవడంతో ఈ అడవి పట్ల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 1960లో జీవశాస్త్రవేత్త అలెగ్జాండ్రూ సిఫ్ట్ తన ఫోటోగ్రాఫ్లో అడవిలో ఎగిరే ఒక వస్తువును కనుగొన్నాడు. ఈ అడవిలో జరిగిన సంఘటనలు, కథనాలు భయపెట్టేలా ఉంటాయి. అందుకే పర్యాటకులు ఇక్కడికి రావడానికి భయపడుతారు.