Balapur Ganesh: 41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి లడ్డూను తొలిసారి ఎవరు దక్కించుకున్నారో తెలుసా?

Balapur Ganesh: బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఈసారి లడ్డూ 24 లక్షల 60 వేల రూపాయలు పలికింది. గత ఏడాది కంటే ఇది 5 లక్షల 70 వేలు అధికం.

|

Updated on: Sep 09, 2022 | 1:57 PM

Balapur Ganesh: బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఈసారి  లడ్డూ 24 లక్షల 60 వేల రూపాయలు పలికింది. గత ఏడాది కంటే ఇది 5 లక్షల 70 వేలు అధికం. బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ్‌ సమితికి చెంది న వంగేటి లక్ష్మారెడ్డి ఈసారి లడ్డూ దక్కించుకున్నారు. ఈయన బాలాపూర్‌ నివాసి. స్థానిక టీఆర్‌ఎస్‌ నేత. ఏ ఏటికాయేడు లడ్డూ ధర విపరీతంగా పెరుగుండటం, ఆ లడ్డూకు అంత క్రేజ్ ఉండటం వెనుక చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Balapur Ganesh: బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఈసారి లడ్డూ 24 లక్షల 60 వేల రూపాయలు పలికింది. గత ఏడాది కంటే ఇది 5 లక్షల 70 వేలు అధికం. బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ్‌ సమితికి చెంది న వంగేటి లక్ష్మారెడ్డి ఈసారి లడ్డూ దక్కించుకున్నారు. ఈయన బాలాపూర్‌ నివాసి. స్థానిక టీఆర్‌ఎస్‌ నేత. ఏ ఏటికాయేడు లడ్డూ ధర విపరీతంగా పెరుగుండటం, ఆ లడ్డూకు అంత క్రేజ్ ఉండటం వెనుక చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
అసలు బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ 1994లో మొదలైంది. ఈ లడ్డూను వేలం వేయగా 450 రూపాయలకు స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. ఆ తరువాత 1995,1998, 2004, 2008లో మోహన్‌ రెడ్డి లడ్డూ అందుకున్నారు.

అసలు బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ 1994లో మొదలైంది. ఈ లడ్డూను వేలం వేయగా 450 రూపాయలకు స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. ఆ తరువాత 1995,1998, 2004, 2008లో మోహన్‌ రెడ్డి లడ్డూ అందుకున్నారు.

2 / 6
బాలాపూర్‌ గణపతికి 41 ఏళ్ల చరిత్ర ఉండగా.. 28 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.

బాలాపూర్‌ గణపతికి 41 ఏళ్ల చరిత్ర ఉండగా.. 28 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.

3 / 6
ఇప్పటివరకూ 27 సార్లు వేలం వేశారు. కరోనా నేపథ్యంలో 2020లో మాత్రం వేలం వేయలేదు. ఆ సంవత్సరంలో సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందజేశారు.

ఇప్పటివరకూ 27 సార్లు వేలం వేశారు. కరోనా నేపథ్యంలో 2020లో మాత్రం వేలం వేయలేదు. ఆ సంవత్సరంలో సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందజేశారు.

4 / 6
అత్యధికంగా బాలాపూర్‌కు చెందిన కొలను కుటుంబీకులే లడ్డూను వేలంపాటలో 9 సార్లు దక్కించుకున్నారు.

అత్యధికంగా బాలాపూర్‌కు చెందిన కొలను కుటుంబీకులే లడ్డూను వేలంపాటలో 9 సార్లు దక్కించుకున్నారు.

5 / 6
2019లో  బాలాపూర్‌ లడ్డూ రూ. 17.60 లక్షలు పలికింది. 2021లో రూ.18.90 లక్షల ధర పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో రూ. 24.60 లక్షలు పలికింది.

2019లో బాలాపూర్‌ లడ్డూ రూ. 17.60 లక్షలు పలికింది. 2021లో రూ.18.90 లక్షల ధర పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో రూ. 24.60 లక్షలు పలికింది.

6 / 6
Follow us