Subhash Goud |
Updated on: Jan 19, 2022 | 1:03 PM
NRI Marital Disputes:ఎన్నారైలను వివాహం చేసుకున్న 2,000 మందికి పైగా భారతీయ మహిళలు వైవాహిక వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇది విదేశాలలో ఉన్న భారతీయ మిషన్ల దృష్టికి వచ్చింది. యూఎస్, యూఏఈలలో అధిక సంఖ్యలో భారతీయులు ఉన్నందున కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వివాహం చేసుకున్న తర్వాత భార్యలను విడిచిపెట్టడం, హింసకు గురవడం వంటి వాటికి గురవుతున్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. విదేశీ భారతీయుల సంఖ్య పెరుగుతున్నందున, వారు విదేశీ భారతీయులను వివాహం చేసుకున్న భారతీయ పౌరుల నుండి వైవాహిక సమస్యలకు సంబంధించిన అనేక పిటిషన్లు, ఫిర్యాదులు వస్తున్నాయి.
భారతీయ పౌరులకు అనుసరించాల్సిన చట్టపరమైన విధానాలు, కోర్టు కేసుల దాఖలు, సమన్ల జారీ, లుక్-అవుట్ సర్క్యులర్లు, పాస్పోర్ట్లను రద్దు చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం, నిర్వహణ, పిల్లల మద్దతు పొందడం మొదలైన వాటి గురించి సమాచారాన్ని అందించడం ద్వారా సాధికారత కల్పిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడేళ్లలో విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఎన్ఆర్ఐ భార్యల నుండి ఫిర్యాదులు అందాయి. వివాహ వివాదాలకు సంబంధించి ప్రత్యేకంగా 2,156 కేసులు ఉన్నాయని తెలిపింది.
ఆర్టీఐ వివరాల ప్రకారం.. 47 దేశాల్లోని ఇటువంటి కేసులు నమోదు అవుతున్నాయి. యూఎస్లో 615, యూఏఈలో 586 కేసులు జనవరి 2016- నవంబర్ 2021 మధ్య కాలంలో నమోదైన కేసులున్నాయని తెలుస్తోంది. అలాగే విదేశీయులను వివాహం చేసుకున్న భారతీయ మహిళలకు న్యాయవాదులు విదేశాలలో మిషన్లతో కూడిన ఎన్జీవోల ద్వారా మంత్రిత్వ శాఖ చట్టపరమైన, ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. విడాకుల కోసం, దాంపత్య హక్కుల పునరుద్దరణ, భరణం, పిల్లల సంరక్షణ, వేధింపులు మొదలైన సమస్యలపై విదేశీ న్యాయస్థానాల నుంచి పరిష్కారం పొందేందుకు పిటిషనర్లను దాఖలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.