Basha Shek | Edited By: Venkata Chari
Updated on: Jun 16, 2022 | 2:17 PM
ఈ సిరీస్లో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించింది. అయితే ఇప్పుడు మూడో టీ20లో ఓడిపోవడంతో సిరీస్ కైవసం చేసుకోవడం కష్టతరంగా మారింది. ఐపీఎల్-2022లో ఐడెన్ మర్క్రమ్ భారీగా పరుగులు సాధించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 400కు పైగా పరుగులు సాధించాడు. బ్యాటింగ్తో పాటు ఆఫ్స్పిన్తోనూ సత్తా చాటగలడీ స్టార్ ప్లేయర్.
కాగా మర్క్రమ్ లేకపోయినా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. ఈ కారణంగానే తొలి టీ20లో ఆతిథ్య జట్టు 211 పరుగులను సులభంగా ఛేదించింది.
భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరోనా కారణంగా మొదటి మూడు మ్యాచ్ల్లో ఆడని స్టార్ ఆటగాడు ఐడన్ మర్క్రమ్ మిగతా రెండు మ్యాచ్లకూ దూరమయ్యాడు.
మర్క్రమ్కు కొవిడ్ సోకినట్లు తొలి టీ20 మ్యాచ్కు ముందు ప్రకటించింది క్రికెట్ సౌతాఫ్రికా. అయితే, జట్టులోని ఇతర సభ్యులెవరూ వైరస్ బారిన పడకపోవడంతో సిరీస్పై దాని ప్రభావం కనిపించలేదు. ఇప్పటివరకు ఐసోలేషన్లో ఉన్న మర్క్రమ్ తాజాగా స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు.
దక్షిణాఫ్రికా టీ20 జట్టులో మర్క్రమ్ కీలక ఆటగాడు. మొత్తం20 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన అతను 39 సగటు, 147 స్ట్రైక్రేట్తో 588 పరుగులు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్గా కూడా 5 వికెట్లు తీశాడు.
ఫామ్ లో ఉన్న మర్ క్రమ్ మిగతా రెండు కీలక మ్యాచ్ లకు సఫారీలకు ఎదురుదెబ్బే.