Venkata Chari |
Updated on: Jan 18, 2022 | 6:13 PM
టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు బుధవారం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను ప్రారంభించనుంది. చాలా కాలం తర్వాత 'గబ్బర్' జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్లో ధావన్కు భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
విదేశీ గడ్డపై వన్డే ఫార్మాట్లో శిఖర్ ధావన్ 2500 పరుగులకు చేరువలో ఉన్నాడు. గబ్బర్ ఇప్పటివరకు 2488 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ ప్రత్యేక మైలురాయికి కేవలం 12 పరుగుల దూరంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికాపై శిఖర్ ధావన్ వన్డే ఫార్మాట్లో 798 పరుగులు సాధించాడు. గబ్బర్ 800 మార్క్కు కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. జనవరి 19న జరిగే తొలి వన్డేలో ఈ స్థానాన్ని సులువుగా సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.
2018లో కోహ్లీ సారథ్యంలో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టు 4-1 తేడాతో ఓడింది. ఆ సమయంలో కోహ్లి జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ఈ సమయంలో కేఎల్ రాహుల్ టీమిండియాను నడింపిచనున్నాడు. ఈ సిరీస్లో ధావన్ మరోసారి సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.