కృతి సనన్ గురించి ఓ వార్త వైరల్ అవుతుండటం చూసి.. మిగిలిన హీరోయిన్ల గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు. అందులోనూ మళ్లీ ఎప్పుడూ అంటూ ఫ్యాన్స్ అడుగుతున్న తీరు చూస్తేనే... తారలను ఎంతగా మిస్ అవుతున్నారో చెప్పకనే చెప్పినట్టు అవుతోంది...
ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా ఎంపికయ్యారట. ఆనంద్ ఎల్. రాయ్ ఈ కాంబోకే ఫిక్స్ అయ్యారు అనేది నార్త్ లో ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్.
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అంటూ అందరూ కృతి సనన్ సౌత్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆలియా అండ్ అదర్స్ గురించి ఆరా తీస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ తర్వాత ఆలియా సౌత్లో ఇప్పటిదాకా సినిమా చేయనేలేదు. ఆమెకు కుదరలేదా? ఎవరూ అప్రోచ్ కావడం లేదా అనే చర్చ మొదలైంది. లైగర్ సినిమా ఫ్లాప్ అయినా, ఆ సినిమా ప్రమోషన్లలో అనన్య పాండే పార్టిసిపేట్ చేసిన తీరు సూపర్ అని గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. సెకండ్ ఛాన్స్ తీసుకుని సక్సెస్ అయితే చూడాలని ఉందంటున్నారు.
సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా సౌత్ సినిమాల మీద కాన్సెన్ట్రేట్ చేయడం లేదు. డార్లింగ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వచ్చిన ఛాన్సును, ఆ సినిమా తెచ్చిన క్రేజ్ని క్యాష్ చేసుకోలేదు ఈ బ్యూటీ. ఇంకో సారి మంచి అవకాశం చూసుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు కదా... అని నార్త్ బ్యూటీలను కలవరిస్తున్నారు సౌత్ ఫ్యాన్స్.