Rajeev Rayala |
Updated on: Jan 08, 2022 | 10:53 AM
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ త్రిష.
వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతోంది త్రిష. తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు బృంద అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.
ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ
తాజాగా ఈ అమ్మడు కరోనా భారిన పడింది. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటించాను.
కొత్త సంవత్సరం ఆరంభానికి కొద్ది రోజుల ముందే కొవిడ్ పాజిటివ్గా నాకు నిర్ధారణ అయింది.
ప్రస్తుతం కొవిడ్ లక్షణాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మహమ్మరి నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.
వ్యాక్సిన్ తీసుకోవడంతో నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. మాస్క్లు ధరించాలి అని కోరింది త్రిష.