PhonePe: యస్ బ్యాంక్ డిపాజిటర్లకు గుడ్న్యూస్.. ఫోన్పే సేవలు తిరిగి ప్రారంభం
ఫైనాన్షియల్ యాప్ ఫోన్పే శనివారం తిరిగి సేవలను ప్రారంభించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం రూ.50వేలు మాత్రమే
PhonePe: ఫైనాన్షియల్ యాప్ ఫోన్పే శనివారం తిరిగి సేవలను ప్రారంభించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం రూ.50వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చని ఆంక్షలు కూడా విధించింది. ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫాం ఫోన్పే ఇబ్బందుల్లో పడింది. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదుపై ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ క్రమంలో రెండు రోజులుగా ఫోన్పేలో లావాదేవీలు నిలిచిపోయాయి. కాగా.. ఫోన్పే కొత్తగా ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇకనుంచి ఫోన్పేకు యస్ బ్యాంకు స్థానంలో ఐసీఐసీఐ నగదు సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు ఫోన్పే ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సమీర్ నిగమ్ ప్రకటించారు. సరైన సమయంలో ఆదుకున్నందుకు ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కు ధన్యవాదాలు తెలిపారు. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు వాలెట్ సర్వీసులు కూడా తిరిగి అందుబాటులోకి రానున్నాయి.
[svt-event date=”08/03/2020,4:37PM” class=”svt-cd-green” ]
Dear @PhonePe_ users. We are back with a bang! Would’ve been impossible to do so in record time without incredible effort & inspirational leadership displayed by @NPCI_NPCI and our new UPI partner @ICICIBank! Will never forget because – A friend in need is a friend indeed ???
— Sameer.Nigam (@_sameernigam) March 7, 2020
[/svt-event]