కరోనా కట్టడికి.. ‘ధారావి మోడల్’ బాటలో.. ఫిలిప్పీన్స్!
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని ధారావిలో కరోనా కట్టడి చేసిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. అత్యధిక జన సాంద్రత గల ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని ధారావిలో కరోనా కట్టడి చేసిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. అత్యధిక జన సాంద్రత గల ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని, కరోనా మహోగ్రరూపం దాలిస్తే భారీగా ప్రాణ నష్టం చవిచూడాల్సి వస్తుందని మొదట్లో అంతా భయపడ్డారు. అయితే ఆ భయాలను పటాపంచలు చేస్తూ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా బ్రిహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) మూడు నెలల్లోనే మహమ్మారి వ్యాప్తిని నియంత్రించగలిగింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ధారావి మోడల్ను ప్రశంసించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కరోనా కట్టడికై ‘ధారావి మోడల్’ను అనుసరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి, ‘‘ఛేజ్ ది వైరస్ పాలసీ’’ బ్లూప్రింట్ను బీఎంసీ ఫిలిప్పీన్స్తో పంచుకున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రయత్నాలకు దక్కిన గౌరవంగా దీనిని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాపించి తొలినాళ్లలో భారత్ ఇతర దేశాల కోవిడ్ కట్టడి మోడల్ను ఆచరిస్తే.. ఇప్పుడు విదేశాలు ధారావి మోడల్ను ఫాలోకావడం సంతోషంగా ఉందన్నారు.
Read More: