పీహెచ్‌డీ చేసినా.. టెర్రరిస్టే

సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా.. మార్చి నెలలో జమ్ము-శ్రీనగర్ రహదారిపై కారు బాంబు పేల్చిన ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఓ పీహెచ్‌డీ స్కాలర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. జామత్‌-ఇ-ఇస్లామీ క్రీయాశీల కార్యకర్త, పీహెచ్‌డీ స్కాలర్‌ హిలాల్‌ అహ్మద్‌ మాంటో అరెస్టైన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. పంజాబ్‌లోని భటిండాలో గల సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా బనీహల్‌ కారు […]

పీహెచ్‌డీ చేసినా.. టెర్రరిస్టే
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 4:29 PM

సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా.. మార్చి నెలలో జమ్ము-శ్రీనగర్ రహదారిపై కారు బాంబు పేల్చిన ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఓ పీహెచ్‌డీ స్కాలర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. జామత్‌-ఇ-ఇస్లామీ క్రీయాశీల కార్యకర్త, పీహెచ్‌డీ స్కాలర్‌ హిలాల్‌ అహ్మద్‌ మాంటో అరెస్టైన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. పంజాబ్‌లోని భటిండాలో గల సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా బనీహల్‌ కారు పేలుడుకి.. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.