జోరుగా ‘ఫైజర్’ కరోనా వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్

అమెరికాలోని ఫైజర్ కంపెనీ, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ సంస్థలు తమ కరోనా వైరస్ వ్యాక్సీన్ ట్రయల్స్ మూడో దశను వేగవంతం చేశాయి. తాజాగా  దాదాపు 44 వేలమంది వలంటీర్లపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని..

జోరుగా 'ఫైజర్' కరోనా వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 13, 2020 | 1:55 PM

అమెరికాలోని ఫైజర్ కంపెనీ, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ సంస్థలు తమ కరోనా వైరస్ వ్యాక్సీన్ ట్రయల్స్ మూడో దశను వేగవంతం చేశాయి. తాజాగా  దాదాపు 44 వేలమంది వలంటీర్లపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని ఈ సంస్థలు ప్రకటించాయి. మొదట తమ టార్గెట్ 30 వేలమందేనని, కానీ ఇప్పుడీ సంఖ్యను పెంచాలనుకుంటున్నామని ఇవి పేర్కొన్నాయి. వచ్ఛే వారం తమ తొలి టార్గెట్ ని చేరుకోవచ్ఛునని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. తమ తొలి దశ ట్రయల్స్ మంచి సానుకూల ఫలితాలను సాధించినట్టు గత ఆగస్టులో ఈ సంస్థలు ప్రకటించాయి. కాగా- ఈ కంపెనీల వ్యాక్సీన్ కి అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలపవలసి ఉంది.