సామాన్యులకు శుభవార్త
న్యూఢిల్లీ: సమాన్యులకు శుభవార్త. ఉద్యోగులకు ఇది సంతోషకరమైన విషయం. PFపై వచ్చే వడ్డీ 8.65 శాతం ఉండనుంది. దీని వల్ల 6 కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ వడ్డీ శాతం 8.55 ఉండేది. ఫిబ్రవరి 21న ప్రత్యేకంగా సమావేశమైన ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ మేరకు వెల్లడించింది. 2017-18లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమల్లోకి రాబోతోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ మాట్లాడుతూ ఉద్యోగులకు పిఎఫ్పై అత్యధిక […]
న్యూఢిల్లీ: సమాన్యులకు శుభవార్త. ఉద్యోగులకు ఇది సంతోషకరమైన విషయం. PFపై వచ్చే వడ్డీ 8.65 శాతం ఉండనుంది. దీని వల్ల 6 కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ వడ్డీ శాతం 8.55 ఉండేది. ఫిబ్రవరి 21న ప్రత్యేకంగా సమావేశమైన ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ మేరకు వెల్లడించింది. 2017-18లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమల్లోకి రాబోతోంది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ మాట్లాడుతూ ఉద్యోగులకు పిఎఫ్పై అత్యధిక వడ్డీ ఇవ్వాలనే నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్టు తెలిపారు. ఇందుకు సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ అంగీకారం తెలిపినట్టు చెప్పారాయన. అయితే ఈ ప్రతిపాదన తర్వాత స్టేజ్లో ఆర్ధిక శాఖ వద్దకు వెళ్లనుంది. అక్కడ కూడా ఓకె అయితే వెంటనే అమల్లోకి వస్తుంది.
పీఎఫ్పై వడ్డీ శాతం 2017-18లో 8.55% 2016-17లో 8.65% 2015-16లో 8.8% 2013-14లో 8.75% 2014-15లో 8.75% 2012-13లో 8.5%