80 రోజుల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. చివరిసారిగా మార్చి 16న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించారు. ఆ తర్వాత మళ్లీ చమురు ధరలు...
దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. చివరిసారిగా మార్చి 16న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించారు. ఆ తర్వాత మళ్లీ చమురు ధరలు పెరగలేదు. ఇప్పుడు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్ ధరలకు డిమాండ్ పెరిగింది. అలాగే క్రూడాయిల్ కూడా బ్యారెల్ ధర 40 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు.. చమురు ధరలపై లీటర్కు 60 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
ప్రముఖ నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు:
– హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ రూ.74.61, డీజిల్ రూ.68.42 – విజయవాడలో పెట్రోల్ లీటర్ రూ.74.86, డీజిల్ రూ68.76 – న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.71.86, డీజిల్ రూ.69.99 – బెంగళూరులో పెట్రోల్ లీటర్ రూ .74.18, డీజిల్ రూ.66.54 – చెన్నైలో పెట్రోల్ లీటర్ 76.07, డీజిల్ రూ.68.74 – ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.78.91, డీజిల్ రూ.68.79
Read More:
మహిళల కోసం కేంద్రం మరో స్కీమ్.. తక్షణమే రూ.10 లక్షల రుణం..
విషాదం.. కరోనా వైరస్తో జర్నలిస్ట్ మృతి