అర్ధరాత్రి పంజాగుట్ట ఫ్లై ఓవర్పై ఘోర ప్రమాదం
హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లై ఓవర్పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న కారు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడటంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో ఉస్మానియాకి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రాణాలను విడిచాడు. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్పై అర్ధరాత్రి ట్రాఫిక్ జామ్ అయింది. […]
హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లై ఓవర్పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న కారు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడటంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో ఉస్మానియాకి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రాణాలను విడిచాడు. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్పై అర్ధరాత్రి ట్రాఫిక్ జామ్ అయింది. యాక్సిడెంట్ కారణంగా కారు ముందు భాగం దెబ్బతింది. బైక్ నుజ్జు నుజ్జు అయింది. పోలీసులు క్రేన్ సహాయంతో కారు, బైక్ తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన వ్యక్తి దగ్గర దొరికిన ఆధారాల ప్రకారం తాజుద్దీన్ కరీంనగర్ వాసిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.