పురావస్తు శాఖ కీలక నిర్ణయం.. 6 నుంచి ‘గోల్కొండ’లో అనుమతి..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలోని చారిత్రక గోల్కొండ కోటలో సోమవారం నుంచి సందర్శకులను అనుమతించనున్నారు.
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలోని చారిత్రక గోల్కొండ కోటలో సోమవారం నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ మేరకు పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం అంతర్గత సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ కేవలం 2000 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని గోల్కొండ కోట పర్యవేక్షణాధికారి నవీన్ తెలిపారు.
కొవిడ్ -19 నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. అదే విధంగా తినుబండారాలను అనుమతించబోమని, క్యాంటీన్లో మంచినీరు మాత్రమే అమ్ముతామన్నారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కోటను తెరిచి ఉంచుతామని, సందర్శకులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.