ఆదివారం నెక్లస్ రోడ్లో జరుగబోయే ‘జార్జ్ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ వస్తున్నందున.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని… ఆయన అభిమానులు, స్టూడెంట్ యూనియన్లు పెద్ద ఎత్తున హాజరయితే ప్రాబ్లెమ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ చిత్రం రిలీజ్ కాబోతుంది. విద్యార్ధి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత కథతో ఆయన పేరునే సినిమా టైటిల్గా పెట్టి మూవీని తెరకెక్కించారు. ఉస్మానియా క్యాంపస్ రాజకీయాల్లో బలమైన విద్యార్థి నాయకుడిగా జార్జ్ రెడ్డి నిలబడ్డారు. జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభించింది.
Breaking News
- పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. వాహనదారుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు. నదిలోకి దూకి యువతిని కాపాడిన ఏఎస్సై మాణిక్యాలరావు. మాణిక్యాలరావును అభినందించిన పోలీసులు, స్థానికులు.
- చెన్నై: సినీ నటుడు రాఘవ లారెన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు. డబ్బు కోసమో, పబ్లిసిటీ కోసమో రజినీ రాజకీయాలకు వస్తున్నారని.. కొందరు మాట్లాడటం దురదృష్టకరం-రాఘవ లారెన్స్. రజినీకి రాజకీయాలు తెలియదు అనడం హాస్యాస్పదం. రజినీని ఎవరు టార్గెట్ చేసినా వాళ్లకు గట్టిగా సమాధానం చెప్తా. త్వరలో రజినీ రాజకీయం ఏంటో అందరూ చూస్తారు-రాఘవ లారెన్స్. రజినీ మీద అభిమానంతో కమలహాసన్ పోస్టర్లను పేడతో కొట్టి చించేవాణ్ణి. వాళ్లిద్దరు కలవడం ద్వారా తమిళనాడులో మంచి రోజులు రాబోతున్నాయి -సినీ నటుడు రాఘవ లారెన్స్.
- కరీంనగర్: కోరుట్లలో వంద పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన. ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఈటెల రాజేందర్. వైద్యంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతుంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రి అంటే ప్రజలు భయపడేవారు. కేంద్ర పథకం ఆయుష్మాన్ పథకం కన్నా ఆరోగ్యశ్రీ మిన్న.
- విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
- విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్ రోడ్డు మీదుగా క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్ను నిషేధించాం-ఈవో సురేష్ బాబు.
- చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
- నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ను కాపీ కొడుతూ జగన్ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.