కడలిలో పసిడి.. ఉప్పాడ సముద్ర తీరానికి జనం పరుగులు.. వేలం వెర్రి అంటున్న అధికారులు
ఈ సీన్ తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో కనిపిస్తోంది. భారీగా కురిసిన వర్షాలకు పురాతన ఇళ్లు కూలిపోయాయి. ఎటు వాళ్లు అటు ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయారు.
నివార్ వణికిస్తుంటే.. ఆ ప్రభావంతో వరద కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వరదలల్లో ఇళ్లు, పొలాలు, రోడ్లు, కాలనీలు మునిగిపోతున్నాయి. ఓవైపు ప్రాణాలు నదుల్లో కొట్టుకుపోతున్నాయి. కానీ, కాకినాడలో అనూహ్యంగా వరదలో బంగారం వేట సాగుతోంది.
ఈ సీన్ తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో కనిపిస్తోంది. భారీగా కురిసిన వర్షాలకు పురాతన ఇళ్లు కూలిపోయాయి. ఎటు వాళ్లు అటు ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయారు.
కొట్టుకొచ్చిన వరద సముద్రంలో కలిసింది. అయితే ఈ వరద నీటిలో, అదీ బీచ్ సమీపంలో ఓ మహిళకు బంగారం దొరికిందని ప్రచారం జరుగుతోంది. దీంతో.. వర్షం, అలల తాకిడిని లెక్కచేయకుండా మిగతా వాళ్లంతా బంగారం వేటలో పడ్డారు. ఒకరిపై ఒకరు ఎగబడుతూ పసిడి కోసం గాలిస్తున్నారు. పుకార్లు నిజమో కాదో తెలుసుకోకుండా జనం వేలం వెర్రితో బంగారం కోసం సముద్ర తీరంలో వెతుకుతున్నారు.