గిన్నెలు, పళ్లాలతో మిడతలను తరుముతున్న రైతులు
రాజస్థాన్లోని నౌగౌర్ జిల్లాకు చెందిన రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచన చేశారు. వంట గిన్నెలు, అన్నం తినే పళ్లాలను కర్రలతో కొడుతూ మిడతలను తరుముతున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల రైతులను మాయదారి మిడతలు బెంబెలేత్తిస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఎడారి మిడతలను తరిమికొట్టేందుకు తలలు పట్టుకుంటున్నారు. డ్రోన్లు, హెలికాఫ్టర్ల సాయంతో రసాయనాలతో పిచికారి చేస్తున్నా మారుమూల ప్రాంతాల పంటలను నాశనం చేస్తున్నాయి. అయితే, రాజస్థాన్లోని నౌగౌర్ జిల్లాకు చెందిన రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచన చేశారు. వంట గిన్నెలు, అన్నం తినే పళ్లాలను కర్రలతో కొడుతూ మిడతలను తరుముతున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలోనూ మిడతలు ప్రవేశించగా అధికారులు డ్రోన్ల సాయంతో కెమికల్స్ పిచికారీ చేస్తుండడంతో వేలాదిగా మిడతలు నేలరాలుతున్నాయి. నౌగౌర్ జిల్లాలోని దిద్వానా గ్రామంలో స్థానికులు తమ పంట పొలాలను కాపాడుకోవడానికి ఇలా శబ్ధాన్ని చేస్తూ తరిమేస్తున్నారు. కాగా, ఎడారి మిడతలకు ఇది పునరుత్పత్తి సమయమని, అందువల్ల మిడతల గుంపులు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మిడతల దండును అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని తీసుకుంటుందని తెలిపారు.
#WATCH Rajasthan: Swarm of locusts entered Nagaur yesterday. People clanged utensils to scare them away. Visuals from Didwana, ADM says, “This is their breeding season. So the problem is going to increase. The local administration is carrying out operations to control it.” pic.twitter.com/FCcunLpECO
— ANI (@ANI) July 1, 2020