జిల్లా జైళ్లశాఖ కీలక నిర్ణయం..కోవిడ్ కారాగారంగా పీలేరు సబ్జైల్
ఏపీలో కరోనా పంజా విసురుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చిత్తూరు జిల్లాను కరోనా వణికిస్తోంది. జిల్లాలోని అన్ని శాఖలను పట్టిపీడిస్తున్న కరోనా చివరకు జైళ్లను కూడా వదలటం లేదు. దీంతో..
ఏపీలో కరోనా పంజా విసురుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చిత్తూరు జిల్లాను కరోనా వణికిస్తోంది. జిల్లాలోని అన్ని శాఖలను పట్టిపీడిస్తున్న కరోనా చివరకు జైళ్లను కూడా వదలటం లేదు. దీంతో చిత్తూరు జిల్లా జైళ్లశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పీలేరు సబ్జైల్ను కోవిడ్ కారాగారంగా మార్చినట్లు జిల్లా జైళ్లశాఖ అధికారి హుస్సేన్రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన పీలేరు సబ్జైల్ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హుస్సేన్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పలు జైళ్ల నుంచి 138 మంది ఖైదీలను పీలేరు జైలుకు తరలించామని చెప్పారు. వీరిలో ఇప్పటి వరకు 83 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. నెగటివ్ వచ్చినవారిలో 50మందిని మదనపల్లెకు, 15మందిని చిత్తూరుకు, నలుగురిని సత్యవేడుకు, ఏడుగురిని తిరుపతి జైళ్లకు తరలించామని వివరించారు. మిగిలిన ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.