ఆర్టికల్ 370రద్దు: చొక్కా చించుకున్న పీడీపీ ఎంపీ

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం సాహోసేపత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదన చేశారు. దీనికి విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ.. రాష్ట్రపతి భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కాగా రాజ్యసభలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టే సమయంలో పీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు నజిర్ అహ్మద్ లావే, ఎంఎం ఫయాజ్ రాజ్యాంగంలోని కొన్ని ప్రతులను చించేశారు. దీంతో వారిద్దరిని బయటకు వెళ్లాలని రాజ్యసభ […]

ఆర్టికల్ 370రద్దు: చొక్కా చించుకున్న పీడీపీ ఎంపీ
Courtesy: Pankaj Nangia/India Today
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2019 | 1:01 PM

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం సాహోసేపత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదన చేశారు. దీనికి విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ.. రాష్ట్రపతి భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కాగా రాజ్యసభలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టే సమయంలో పీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు నజిర్ అహ్మద్ లావే, ఎంఎం ఫయాజ్ రాజ్యాంగంలోని కొన్ని ప్రతులను చించేశారు. దీంతో వారిద్దరిని బయటకు వెళ్లాలని రాజ్యసభ చైర్మన్ కోరారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఫయాజ్ తన చొక్కాను చించుకొని తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం బయటకు వెళ్లి.. వారిద్దరు తమ ఆందోళనను కొనసాగించారు.