ఉల్లి కష్టాలకు ఇలా చెక్ చెప్పండిః ఏపీ సీఎంకు పవన్ సలహా
ఉల్లికోసం ప్రజలు పడుతున్న కష్ట్రాలను చూసి చలించిపోయాడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఉల్లిపాయల కోసం గుడివాడలోని రైతు బజారులో గంటల తరబడి నిలబడి చివరకు గుండెపోటుతో మరణించిన సాంబయ్య ఘటన పట్ల పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లిపాయాల కోసం మనుషులు చనిపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఏపీ సీఎం జగన్ను ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. కిలో ఉల్లిపాయల కోసం గంటల తరబడి ప్రజలను క్యూలైన్లలో నిలబెట్టే బదులు తమరు నియమించిన […]
ఉల్లికోసం ప్రజలు పడుతున్న కష్ట్రాలను చూసి చలించిపోయాడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఉల్లిపాయల కోసం గుడివాడలోని రైతు బజారులో గంటల తరబడి నిలబడి చివరకు గుండెపోటుతో మరణించిన సాంబయ్య ఘటన పట్ల పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లిపాయాల కోసం మనుషులు చనిపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఏపీ సీఎం జగన్ను ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. కిలో ఉల్లిపాయల కోసం గంటల తరబడి ప్రజలను క్యూలైన్లలో నిలబెట్టే బదులు తమరు నియమించిన గ్రామ వాలెంటర్లతో ఇంటింటికి ఉల్లిని సరఫరా చేయవచ్చు కదా..! అని జగన్కు సలహా ఇచ్చారు పవన్. ఆ దిశగా ఆలోచిస్తే ప్రజల చెంతకు ఉల్లి చేరుతుందని, అలాగే క్యూ లైన్లో మరణాలు కూడా ఉండవని చెప్పారు.
మీరు ప్రజలని క్యూలలో నుంచోపెట్టి చంపేకంటే , మీరు నియమించిన గ్రామ వాలంటీర్లను ఉపయోగించి ,ప్రజలు ఇళ్ల దగ్గరికే కిలో 25 రూపాయలకే ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయట్లేదో, Sri Jagan Reddy గారు వివరణ ఇవ్వాలి pic.twitter.com/J726DVYFsy
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2019