అన్నయ్య అలా చేసుంటే.. ఇవాళ ప్రజారాజ్యం ఉండేది
తన సోదరుడు చిరంజీవి మెతకతనం, ఒత్తిడితోనే ప్రజారాజ్యం పార్టీని నడపలేకపోయారని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పటిలా ఆ సమయంలో నేతలందరినీ కూర్చొబెట్టి మాట్లాడి ఉంటే ఈ రోజు ప్రజారాజ్యం పార్టీ ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేనకు ప్రస్తుతం అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని.. భవిష్యత్లో ఏపీ అసెంబ్లీ మొత్తం స్థానాలను ఆక్రమించే స్థాయికి తమ పార్టీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఓటు కీలకమైందని.. జనసైనికులంతా పార్టీ […]
తన సోదరుడు చిరంజీవి మెతకతనం, ఒత్తిడితోనే ప్రజారాజ్యం పార్టీని నడపలేకపోయారని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పటిలా ఆ సమయంలో నేతలందరినీ కూర్చొబెట్టి మాట్లాడి ఉంటే ఈ రోజు ప్రజారాజ్యం పార్టీ ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేనకు ప్రస్తుతం అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని.. భవిష్యత్లో ఏపీ అసెంబ్లీ మొత్తం స్థానాలను ఆక్రమించే స్థాయికి తమ పార్టీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి ఓటు కీలకమైందని.. జనసైనికులంతా పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నరసాపురం లోక్సభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అపజయానికి కుంగిపోయి.. విజయానికి పొంగిపోయే వ్యక్తిని తాను కాదని.. ఎలాంటి సమస్యనైనా చాలా బలంగా ఎదుర్కోగలనని, తనపై తనకు ఆ నమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రజలు తనకు ఓట్లేయకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. తన ఆఖరి శ్వాస వరకు పార్టీని నడుపుతానని ఆయన స్పష్టం చేశారు.