నా భిక్షతోనే జగన్ సీఎం అయ్యారు: పవన్

జగన్ తన భిక్ష వలనే సీఎం అయ్యాడు అన్నట్లుగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్.. చంద్రబాబు, బీజేపీతో తాను కలిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని.. ఈ విషయంలో వైసీపీ నేతలు తనకు దండం పెట్టాలని ఆయన కామెంట్లు చేశారు. ఇక తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేను అన్న పవన్.. ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే ఆ పార్టీతో విభేదించానని చెప్పుకొచ్చారు. అందుకే ఎన్నికల్లో […]

నా భిక్షతోనే జగన్ సీఎం అయ్యారు: పవన్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2019 | 1:30 PM

జగన్ తన భిక్ష వలనే సీఎం అయ్యాడు అన్నట్లుగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్.. చంద్రబాబు, బీజేపీతో తాను కలిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని.. ఈ విషయంలో వైసీపీ నేతలు తనకు దండం పెట్టాలని ఆయన కామెంట్లు చేశారు.

ఇక తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేను అన్న పవన్.. ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే ఆ పార్టీతో విభేదించానని చెప్పుకొచ్చారు. అందుకే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశానని.. ఇప్పటికీ తాను బీజేపీతో కలిసే ఉన్నానని స్పష్టతను ఇచ్చారు. దేశ ప్రయోజనాలు, ప్రజల కోసం బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఆయన మాటల తూటాలు పేల్చారు. కియా కంపెనీ సీఈవోను వైసీపీ ఎంపీ వేలు చేపించి బెదిరించారని పవన్ గుర్తుచేశారు. 75శాతం స్థానికులకే ఉద్యోగాలు అంటే ఏ పరిశ్రమలు వస్తాయి..? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని.. తన ఇంటి దగ్గరలో జరుగుతున్న మత మార్పిడులు జగన్‌కు కనపడడం లేదా..? అని పవన్ కామెంట్లు చేశారు. వైసీపీ నేతలు తన ప్రతి మాటన వక్రీకరిస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చేశారు.