నీ త్యాగం ఈ నేల ఎన్నటికీ మరువదు-పవన్ కళ్యాణ్
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో ముగ్గరు అమరులు కావడం కలవరపరచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ ముగ్గురు వీరులకి తన తరపున, జనసేన తరపున నివాళి ఘటిస్తున్నానన్నారు. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉన్నారని తెలిసి బాధపడ్డానని చెప్పారు. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదన్నారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. కల్నల్ సంతోష్ భార్య, బిడ్డలకు, కుటుంబానికి […]
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో ముగ్గరు అమరులు కావడం కలవరపరచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ ముగ్గురు వీరులకి తన తరపున, జనసేన తరపున నివాళి ఘటిస్తున్నానన్నారు. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉన్నారని తెలిసి బాధపడ్డానని చెప్పారు. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదన్నారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. కల్నల్ సంతోష్ భార్య, బిడ్డలకు, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ వేడుకున్నారు.
గాల్వన్ లోయ అమర వీరులకు సెల్యూట్! #GalwanValley pic.twitter.com/cJG2II8eGc
— JanaSena Party (@JanaSenaParty) June 16, 2020
Salute to martyrs of #GalwanValley! pic.twitter.com/mgHWBZdf1K
— JanaSena Party (@JanaSenaParty) June 16, 2020