జరిగిన ఎన్నికలు మార్పుకు నాంది పలకబోతున్నాయి- జనసేనాని
జరిగిన ఎన్నికలు ఖచ్చితంగా మార్పు సూచిస్తున్నాయని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మార్పు కోసం తన పని తాను చేసుకుంటూ వెళ్తానన్న జనసేనాని..ఫలితాలు ఎలా వచ్చినా వాటిని గౌరవిస్తామని చెప్పారు. ఈవీఎం యంత్రాలకు సంభందింది స్పందించిన పవన్ కళ్యాణ్ కొంత పరిధి మేరకు వీవీ ఫ్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్న స్టాండ్పై కట్టుబడి ఉన్నామన్నారు. ఈ విషయంపై అనుభవం ఉన్న నేతలంతా కలిసి కూర్చోని మాట్లాడితే మంచిదని అభిప్రాయపడ్డారు. కాగా జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి […]
జరిగిన ఎన్నికలు ఖచ్చితంగా మార్పు సూచిస్తున్నాయని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మార్పు కోసం తన పని తాను చేసుకుంటూ వెళ్తానన్న జనసేనాని..ఫలితాలు ఎలా వచ్చినా వాటిని గౌరవిస్తామని చెప్పారు. ఈవీఎం యంత్రాలకు సంభందింది స్పందించిన పవన్ కళ్యాణ్ కొంత పరిధి మేరకు వీవీ ఫ్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్న స్టాండ్పై కట్టుబడి ఉన్నామన్నారు. ఈ విషయంపై అనుభవం ఉన్న నేతలంతా కలిసి కూర్చోని మాట్లాడితే మంచిదని అభిప్రాయపడ్డారు.
కాగా జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఇటీవలే కాలం చేసిన విషయం తెలిసిందే. అప్పుడు విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. దాంతో ఆయన ఈ రోజు కర్నూలు వచ్చి ఎస్పీవై రెడ్డికి నివాళి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్మించారు.