రాలేనని చెప్పిన పవన్ కల్యాణ్..!
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్లకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే.
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్లకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీరియళ్ల షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. అయితే సినిమా వాళ్లు మాత్రం షూటింగ్ల్లో పాల్గొనేందుకు అంత ధైర్యం చేయలేకపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో స్టార్ హీరోలు సైతం షూటింగ్లకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇప్పట్లో షూటింగ్లకు రాలేనని నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఆయన నటిస్తోన్న వకీల్ సాబ్కి సంబంధించి మరో షెడ్యూల్ మాత్రమే పెండింగ్లో ఉండగా.. దాన్ని త్వరలో పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు అనుకున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను షూటింగ్లకు రాలేనని ఆయన చెప్పారట. కేసులు పెరుగుతుండటం, ఇంట్లో పిల్లలు కూడా ఉండటంతో రిస్క్ తీసుకోకూడదని పవన్ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో షూటింగ్లకు రాలేనన్న తన నిర్ణయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఒక్కరే కాదు చిరు, మహేష్, బాలయ్య, వెంకటేష్, చెర్రీ, ఎన్టీఆర్ సైతం మరికొన్ని నెలలు సెట్స్ మీదకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేకపోవడంతో.. దర్శకనిర్మాతలు సైతం హీరోల మీద ఒత్తిడిని తీసుకురావట్లేదని తెలుస్తోంది.
Read This Story Also: మరోసారి ‘రియల్ హీరో’ అనిపించుకున్న మహేష్ బాబు.. ఏం చేశారంటే..!