సాయితేజ్ కోసం.. పవర్ స్టార్
'చిత్రలహరి', 'ప్రతీ రోజూ పండగే' సినిమాలతో హిట్లు కొట్టిన మెగాహీరో సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దానితో పాటు ఇప్పుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్..
‘చిత్రలహరి’, ‘ప్రతీ రోజూ పండగే’ సినిమాలతో హిట్లు కొట్టిన మెగాహీరో సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దానితో పాటు ఇప్పుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా హైదరాబాద్లో గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరై మొదటి క్లాప్ని కొట్టారు. అలాగే.. బీవీఎస్ఎన్ ప్రసాద్, అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి హాజరయ్యారు.
కాగా ఈ సినిమాకి ‘ప్రస్థానం’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ దేవర కట్టా.. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కబోతుందట. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే.. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు డైరెక్టర్ దేవర కట్టా తెలిపారు.
#SDT14 starts today in the presence of Power Star Pawan Kalyan, Allu Arvind, BVSN Prasad and Vamshi Paidipally. @IamSaiDharamTej and Nivetha Pethuraj pair up in this @DevaKatta film.Produced by Bhagawan and Pulla Rao
Music – Mani Sharma DOP – Sham Dat
Shoot starts in April 2020 pic.twitter.com/hXoZu5NelS
— BARaju (@baraju_SuperHit) March 12, 2020
Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..
హీరో, హీరోయిన్కు కరోనా.. షాక్లో సినీ ఇండస్ట్రీ
మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు
బ్రేకింగ్: ఇటలీలో చిక్కుకున్న విద్యార్థులకు విముక్తి.. కేంద్రం ప్రత్యేక సాయం