పవన్ ఫోకస్ అంతా ఆ మూవీపైనే..పక్కా స్కెచ్ రెడీ..!
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పవన్..రాజకీయాలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ప్రస్తుతం మూడు మూవీలున్నాయి.
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పవన్..రాజకీయాలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ప్రస్తుతం మూడు మూవీలున్నాయి. వాటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘వకీల్సాబ్’తో పాటు.. క్రిష్, హరీశ్ శంకర్ల సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘వకీల్సాబ్’ షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉండగా.. క్రిష్తో చేస్తున్న ప్రాజెక్టు ఓ షెడ్యూల్ను కంప్లీట్ చేసుకుంది. అయితే షూటింగులకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన వెంటనే పవన్, తన ఫోకస్ అంతా ‘వకీల్సాబ్’పైనే పెట్టనున్నారట. ఇందుకు సంబంధించి ఆయన సన్నిహిత వర్గాల నుంచి ఓ ప్రకటన రిలీజైంది.
“షూటింగులు పునః ప్రారంభమైన వెంటనే పవన్ ‘వకీల్సాబ్ ను కంప్లీట్ చేసేందుకు రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత పూర్తిగా క్రిష్ సినిమాకి సమయాన్ని కేటాయిస్తారు. వీటిని వరుస షెడ్యూళ్లలో కంప్లీట్ చేయబోతున్నారు” అని ఆ ప్రకటనలో వివరించారు.
కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల మూవీస్ విడుదలతో పాటు షూటింగ్లు కూడా పూర్తిగా బంద్ అయ్యాయి. అయితే ఇటీవలే ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో పలు నిబంధనలతో షూటింగులు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.