జనసేన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌.. కేరాఫ్ పాలకొల్లు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి హరిరామ జోగయ్యను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో పరామర్శించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభిస్తానని ప్రకటించారు. జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా దీనిపై ఓ నోట్ విడుదల చేసింది. పాలకొల్లులో టాలీవుడ్‌ లెజెండ్‌ ఎస్వీ రంగారావు పేరుతో ఈ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తామని […]

జనసేన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌.. కేరాఫ్ పాలకొల్లు!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 01, 2019 | 8:25 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి హరిరామ జోగయ్యను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో పరామర్శించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభిస్తానని ప్రకటించారు.

జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా దీనిపై ఓ నోట్ విడుదల చేసింది. పాలకొల్లులో టాలీవుడ్‌ లెజెండ్‌ ఎస్వీ రంగారావు పేరుతో ఈ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొంది. అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ లాంటి గొప్ప దర్శకులు పాలకొల్లు నుంచి వచ్చిన వారేనని ఆ ప్రకటనలో గుర్తు చేసింది. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసుల నేతృత్వంలో నడిచే  ఈ ఇన్‌స్టిట్యూట్‌కి ఛైర్మన్‌గా హరిరామజోగయ్య వ్యవహరిస్తారు.