డ్రోన్ల ద్వారా భారత్లోకి ఆయుధాలు వదులుతున్న పాక్..!
దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు ఉగ్రవాదులను దేశంలోకి ఉసిగొల్పి.. అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తూ.. మరో వైపు డ్రోన్లతో భారత్లో దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా సరిహద్దుల్లో డ్రోన్లు సంచరిస్తుండటంతో సరిహద్దు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోని భారత వైమానిక స్థావరాలపై దాడులకు పాక్ కుయుక్తులు పన్నుతుందని నిఘా వర్గాలు హెచ్చిరికలు […]
దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు ఉగ్రవాదులను దేశంలోకి ఉసిగొల్పి.. అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తూ.. మరో వైపు డ్రోన్లతో భారత్లో దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా సరిహద్దుల్లో డ్రోన్లు సంచరిస్తుండటంతో సరిహద్దు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోని భారత వైమానిక స్థావరాలపై దాడులకు పాక్ కుయుక్తులు పన్నుతుందని నిఘా వర్గాలు హెచ్చిరికలు జారీ చేశాయి.
ఈ నేపథ్యంలో పంజాబ్లోని పఠాన్కోట్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్కు చెందిన డ్రోన్లు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. డ్రోన్ల ద్వారా భారత భూభాగంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నకిలీ నోట్లు, మత్తుపదార్థాలను జార విడుస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పంజాబ్ – హిమాచల్ – పాకిస్థాన్ సరిహద్దును పంజాబ్ పోలీసులు జల్లెడపడుతున్నారు. పంజాబ్, పఠాన్కోట్ల మీదుగానే పాక్ డ్రోన్లు సరిహద్దును దాటి దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న దృష్ట్యా వాటిని అడ్డుకొనేందుకు గట్టి నిఘా ఉంచారు. సరిహద్దులో అణువణువునూ గాలిస్తున్నారు. జమ్మూ-కశ్మీర్లోని ఉగ్రవాదులకు అందజేయడం కోసం పాక్ అధికార వర్గాలే ఈ డ్రోన్లను పంపిస్తున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు నివేదించాయి.