పాక్లో ఘోర బస్సు ప్రమాదం..13 మంది సజీవదహనం
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. 20మందితో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి చెందారు.
Pakistan bus accident: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. 20మందితో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి చెందారు. మరో ఐదుగురికి పరిస్థితి విషమంగా ఉండగా.. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఈ బస్సు కరాచీకి వెళ్తుండగా శనివారం అర్దరాత్రి ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగంతో ఈ బస్సు వెళ్తుండగా.. బోల్తా కొట్టిన వెంటనే అందులో మంటలు అంటుకున్నాయి. ఆ తరువాత మంటలు బస్సు మొత్తం వ్యాపించగా.. అధిక సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారని’ పోలీసులు వెల్లడించారు.
Read More:
ఆ మూవీ స్ఫూర్తితోనే ‘నిశ్శబ్దం’ను రాశారట