దివాలా చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం

మూడేళ్ల నాటి రుణాల ఎగవేత, దివాలా స్మృతి చట్ట సవరణ బిల్లు-2019కు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ బిల్లులో రుణదాతలు, గ్రహీతలకు సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. రుణ ఎగవేతదారులను దివాలా బిల్లు ఏరివేస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఈ బిల్లులో రుణాలకు సంబంధించి దాతలకు ప్రాధాన్యం కల్పించారు. అలాగే అప్పు ఎగవేతదారుల ఆస్తులను వేలం వేసేందుకు రుణదాతలకు అధికారం ఇవ్వనున్నారు. […]

దివాలా చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 7:00 AM

మూడేళ్ల నాటి రుణాల ఎగవేత, దివాలా స్మృతి చట్ట సవరణ బిల్లు-2019కు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ బిల్లులో రుణదాతలు, గ్రహీతలకు సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. రుణ ఎగవేతదారులను దివాలా బిల్లు ఏరివేస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇక ఈ బిల్లులో రుణాలకు సంబంధించి దాతలకు ప్రాధాన్యం కల్పించారు. అలాగే అప్పు ఎగవేతదారుల ఆస్తులను వేలం వేసేందుకు రుణదాతలకు అధికారం ఇవ్వనున్నారు. ఈ చట్టం అమలులో ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకున్నామని.. దివాలా ప్రక్రియ పూర్తయ్యాక సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.