ముంబయిలో నోపార్కింగ్లో ఆపితే రూ.23వేలు ఫైన్!
దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో రేపటి నుంచి కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్, ముంబయి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నారు. నోపార్కింగ్ జోన్లో వాహనాన్ని నిలిపితే రూ.5వేల నుంచి రూ.23 వేల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 26 పార్కింగ్ ప్రదేశాలు, బీఈఎస్టీఎస్ డిపోలను దాటిన 500 మీటర్ల తర్వాత నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. మారిన నిబంధనల ప్రకారం […]
దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో రేపటి నుంచి కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్, ముంబయి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నారు. నోపార్కింగ్ జోన్లో వాహనాన్ని నిలిపితే రూ.5వేల నుంచి రూ.23 వేల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 26 పార్కింగ్ ప్రదేశాలు, బీఈఎస్టీఎస్ డిపోలను దాటిన 500 మీటర్ల తర్వాత నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి.
మారిన నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలను రాంగ్ పార్కింగ్లో నిలిపితే రూ.5వేల నుంచి రూ.8,300 వరకు, భారీ వాహనాలకు అయితే రూ.15 వేల నుంచి రూ.23,250 వరకు అపరాధ రుసుం విధిస్తారు. మధ్యశ్రేణి వాహనాలకు రూ.11 వేల నుంచి రూ.17,600, లైట్ మోటార్ వెహికల్స్కు రూ.10వేల నుంచి రూ.15,100 వరకు విధిస్తారు. ఇక త్రిచక్ర వాహనాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.8వేల నుంచి రూ.12,200 వరకు అపరాధ రుసుం కట్టాల్సిందే. ఆలస్యంగా చెల్లించేవారికి అదనపు ఛార్జిలు కూడా విధించనున్నారు. ముంబయిలో దాదాపు 30 లక్షల వాహనాలు ఉంటాయని అంచనా. దీంతో జరిమానాలు విధించే సమయంలో వాహనదారులకు అధికారులకు మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో బీఎంసీ ఇప్పటికే ఎక్స్సర్వీస్ మెన్, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమించుకొంది.