రీపోలింగ్‌కు పరిటాల సునీత డిమాండ్

సార్వత్రిక ఎన్నికల వేళ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నేతల ఆగడాలు శ్రుతి మించుతున్నాయని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. తమ ఏజెంట్లను కనీసం పోలింగ్ కేంద్రానికి అనుమతించటం లేదని.. అదే సమయంలో వైసీపీ వారిని మాత్రం అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలు, నేతలు, అభిమానులపై దాడులు జరుగుతున్నా పోలీసులు, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈవీఎంలు చాలా చోట్ల పని చేయడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు మండలాల్లో […]

రీపోలింగ్‌కు పరిటాల సునీత డిమాండ్
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2019 | 3:10 PM

సార్వత్రిక ఎన్నికల వేళ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నేతల ఆగడాలు శ్రుతి మించుతున్నాయని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. తమ ఏజెంట్లను కనీసం పోలింగ్ కేంద్రానికి అనుమతించటం లేదని.. అదే సమయంలో వైసీపీ వారిని మాత్రం అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలు, నేతలు, అభిమానులపై దాడులు జరుగుతున్నా పోలీసులు, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈవీఎంలు చాలా చోట్ల పని చేయడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు మండలాల్లో మహిళలకు, వృద్ధులకు కనీస సౌకర్యలు సైతం కల్పించలేదని ఆక్షేపించారు. మరోసారి పోలింగ్ జరపాలని సునీత డిమాండ్ చేశారు.