మహేష్తో మూవీ.. అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్..!
మహేష్ నెక్ట్స్ మూవీ డైరక్టర్పై క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులుగా వస్తోన్న పుకార్లపై గీత గోవిందం దర్శకుడు తాజాగా స్పష్టతను ఇచ్చేశారు. తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉండబోతుందని ఆయన ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పరశురామ్.. మహేష్ మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహేష్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే ఈ చిత్రం ఉండబోతుందని పరశురామ్ తెలిపారు. మహేష్ నటించిన ఒక్కడు సినిమా చూసిన తరువాత తాను […]
మహేష్ నెక్ట్స్ మూవీ డైరక్టర్పై క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులుగా వస్తోన్న పుకార్లపై గీత గోవిందం దర్శకుడు తాజాగా స్పష్టతను ఇచ్చేశారు. తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉండబోతుందని ఆయన ప్రకటించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పరశురామ్.. మహేష్ మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహేష్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే ఈ చిత్రం ఉండబోతుందని పరశురామ్ తెలిపారు. మహేష్ నటించిన ఒక్కడు సినిమా చూసిన తరువాత తాను దర్శకుడు అవ్వాలని ఫిక్స్ అయినట్లు ఈ సందర్భంగా వివరించారు. ఇక మహేష్తో మూవీకి ముందు పరశురామ్ నాగచైతన్యతో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఆ లోపు మహేష్తో సినిమా తీసేందుకు పరశురామ్ సిద్దమయ్యాడని టాక్ రావడంతో.. చైతూతో తెరకెక్కించాల్సిన చిత్రం అటకెక్కినట్లు వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఆ వార్తలపై కూడా ఆయన స్పందించారు. నాగ చైతన్యతో తాను కచ్చితంగా సినిమాను తెరకెక్కిస్తానని.. మహేష్ మూవీ తరువాత ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని వివరణ ఇచ్చారు.
Read This Story Also: చెర్రీని పోలీస్ బెల్ట్తో కొట్టిన చిరు.. నాగబాబు వల్లేనా..!