నీటి కోసం వచ్చిన చిరుత మృతి..!
రాజస్థాన్ లో దారుణం జరిగింది. నీటి జాడ కోసం వచ్చిన చిరుత విద్యుత్ షాక్ తో మృతిచెందింది.
రాజస్థాన్ లో దారుణం జరిగింది. నీటి జాడ కోసం వచ్చిన చిరుత విద్యుత్ షాక్ తో మృతిచెందింది. రాజస్థాన్ లోని భిల్వారా జిల్లా కరేడా ఏరియాలోని రామ్ పూర్ గ్రామంలో కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదే క్రమంలో చిరుతపులి నీటి జాడ కోసం వెతుక్కుంటూ రామ్పూర్ గ్రామానికి చేరుకుంది. నీటి కోసం వెతికే క్రమంలోనే చిరుత చెట్టుపైకి ఎక్కి ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే సమీపంలోని గ్రానైట్ గనికి విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతిచెందిందని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ దేవేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కళేబరాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఆయన తెలిపారు.