GHMC Elections: పటాన్చెరులో బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని చైతన్ననగర్ కాలనీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
GHMC Elections:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని 113 డివిజన్ చైతన్ననగర్ కాలనీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సింగ్ అనే యువకుడ్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి దాడి చేశాడని ఆరోపించాడు. కాషాయం కండువా ఎందుకు వేసుకున్నావని బెదించాడని బాధితుడు తెలిపారు. దీంతో ఇద్దరు మధ్య మాటా మాటా పెరిగి వాగ్వివాదానికి దారి తీసింది. రెండు పార్టీలకు నేతలు చేరుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదర కొట్టడంతో గొడవ సర్ధుమణిగింది.