కర్తార్పూర్ కు రాకపోకలు పునరుద్ధరణ
సిక్కుమతస్థులు పవిత్రంగా భావించే మహారాజా రంజిత్సింగ్ ఆశ్రమం కర్తార్పూర్ కు రాకపోకలు పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ అనుమతినిచ్చింది. సిక్కు మత గురువు మహారాజా రంజిత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని కర్తార్పూర్ కారిడార్ను తెరిచేందుకు పాకిస్థాన్ సర్కార్ అనుమితినిచ్చింది. ఈ మేరకు ఈనెల 29 నుంచి రాకపోకలకు సాగించేందుకు వీలు కల్పిస్తూ పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
సిక్కుమతస్థులు పవిత్రంగా భావించే మహారాజా రంజిత్సింగ్ ఆశ్రమం కర్తార్పూర్ కు రాకపోకలు పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ అనుమతినిచ్చింది. సిక్కు మత గురువు మహారాజా రంజిత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని కర్తార్పూర్ కారిడార్ను తెరిచేందుకు పాకిస్థాన్ సర్కార్ అనుమితినిచ్చింది. ఈ మేరకు ఈనెల 29 నుంచి రాకపోకలకు సాగించేందుకు వీలు కల్పిస్తూ పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పాక్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖురేషీ సైతం ఇదే విషయాన్ని ట్విటర్లో పోస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల్లోకి అనుమతిస్తున్నందున తాము కూడా సిక్కు యాత్రికుల కోసం కర్తాపూర్పూర్ సాహిబ్ కారిడార్ను తెరుస్తున్నామన్నారు. అలగే, మహారాజా రంజిత్సింగ్ వర్ధంతి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాక్ పేర్కొంది. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 16 నుంచి కర్తార్పూర్ సాహిబ్ గురుద్వార సందర్శనను భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. కర్తాపూర్ కారిడార్ తెరవడం ద్వారా సిక్కులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.