దారుణం.. భారత పౌరుని తల, మొండెం వేరు చేసిన పాక్ సైన్యం!
పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. ఇండియా సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. పదే పదే కావాలని అలజడిని సృష్టించాలనుకుంటోంది పాక్ సరిహద్దు సైన్యం. తాజాగా మరోసారి నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు భారత పౌరులను, పాక్ సైన్యం హతమార్చింది. కాగా.. జమ్మూకశ్మీర్ ఫూంచ్ సెక్టార్ వద్ద నిరాయుధులైన ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టన పెట్టుకుంది. అందులో ఒక వ్యక్తిని దారుణాతి దారుణంగా హతమార్చారు. తల, మొండెం వేరు చేసి చంపేశారు. […]
పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. ఇండియా సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. పదే పదే కావాలని అలజడిని సృష్టించాలనుకుంటోంది పాక్ సరిహద్దు సైన్యం. తాజాగా మరోసారి నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు భారత పౌరులను, పాక్ సైన్యం హతమార్చింది. కాగా.. జమ్మూకశ్మీర్ ఫూంచ్ సెక్టార్ వద్ద నిరాయుధులైన ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టన పెట్టుకుంది. అందులో ఒక వ్యక్తిని దారుణాతి దారుణంగా హతమార్చారు. తల, మొండెం వేరు చేసి చంపేశారు. మృతి చెందిన వారిని మహ్మద్ అస్లాం, అల్తాఫ్ హుస్సేన్గా గుర్తించింది భారత సైన్యం. ఈ దాడి రెండు రోజుల క్రితం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.