ఇమ్రాన్ ఖాన్ పతనానికి నాంది.. పాక్ ప్రజల అసలు సమస్య ఇదే!
దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతని ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని ప్రతిసారి ఎత్తి చూపిస్తున్నారు తప్ప.. పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్యపై మాత్రం దృష్టి సారించట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పాక్ ప్రజలను తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం, నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయని గాలప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ సర్వేలో తేల్చి చెప్పింది. ఆర్ధిక మాంద్యం తర్వాత నిరుద్యోగం(23%), అవినీతి(4%), నీటి సంక్షోభం(4%) వంటి సమస్యలు […]
దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతని ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని ప్రతిసారి ఎత్తి చూపిస్తున్నారు తప్ప.. పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్యపై మాత్రం దృష్టి సారించట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పాక్ ప్రజలను తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం, నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయని గాలప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ సర్వేలో తేల్చి చెప్పింది.
ఆర్ధిక మాంద్యం తర్వాత నిరుద్యోగం(23%), అవినీతి(4%), నీటి సంక్షోభం(4%) వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని 53% మంది పాకిస్థానీలు అభిప్రాయపడుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు కశ్మీర్ అంశం సమస్యగా మారిందని కేవలం 8 శాతం పాక్ ప్రజలు మాత్రమే చెప్పడం గమనార్హం. కశ్మీర్ అంశం కంటే.. దిగజారిపోతున్న ఆర్ధిక వ్యవస్థపైనే వారికి ఎక్కువగా ఆందోళన కలుగుతోందని నిపుణులు అంటున్నారు.
ఇవే కాదు రాజకీయ అస్థిరత్వం, విద్యుత్ సంక్షోభం, డెంగ్యూ వంటి అంశాలకు కూడా పాకిస్థానీలు భయభ్రాంతులు చెందుతున్నారని ఈ సర్వే పేర్కొంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, పంజాబ్, సింధ్ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి గాలప్ ఇంటర్నేషనల్ అభిప్రాయాలను సేకరించింది.