పాక్లో సైకో డాక్టర్ నిర్వాకం.. 90 మందికి సోకిన హెచ్ఐవీ
ఓ వైద్యుడి నిర్లక్ష్యం 90 మంది వ్యక్తులకు శాపంగా మారింది. వాడిపడేసిన సిరంజిలనే వాడటంతో 90 మంది వ్యక్తులు హెచ్ఐవీ బారిన పడ్డారు. వీరిలో 65 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. వైద్యాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వైద్యుడు ఇదివరకే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడని పోలీసులు వెల్లడించారు. లర్కానా నగర సమీప ప్రాంతాల్లో 18 మంది చిన్నారుల్లో హెచ్ఐవీని గుర్తించిన అధికారులు ఆ ప్రాంతంలో […]
ఓ వైద్యుడి నిర్లక్ష్యం 90 మంది వ్యక్తులకు శాపంగా మారింది. వాడిపడేసిన సిరంజిలనే వాడటంతో 90 మంది వ్యక్తులు హెచ్ఐవీ బారిన పడ్డారు. వీరిలో 65 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. వైద్యాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వైద్యుడు ఇదివరకే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడని పోలీసులు వెల్లడించారు.
లర్కానా నగర సమీప ప్రాంతాల్లో 18 మంది చిన్నారుల్లో హెచ్ఐవీని గుర్తించిన అధికారులు ఆ ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. వైద్య పరీక్షలకు ఆదేశించగా పదుల సంఖ్యలో పిల్లలు హెచ్ఐవీ బారిన పడినట్లు గుర్తించారు. మొత్తం 90 మందికి పైగా వ్యక్తుల్లో హెచ్ఐవీ పాజిటీవ్ వచ్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిలో 65 మంది చిన్నారులు ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అబ్దుల్ రహమాన్ తెలిపారు. విచారణలో ఓ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. సదరు వైద్యుడు కలుషిత సిరంజీలు వాడటం వల్లే వ్యాధి వ్యాప్తికి కారకుడయ్యాడని పేర్కొన్నారు.