మసూద్కు మరో పోటు.. కఠిన చర్యలకు పాక్ రెడీ
జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో అతడిపై చర్యలకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. నిబంధనల ప్రకారం అజార్ ఆస్తులను జప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాకుండా అతడు ఎలాంటి ఆయుధాల కొనుగోలు, విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. అలాగే మసూద్ విదేశీ ప్రయాణాలపైనా.. పాక్ నిషేధం విధించింది. ఈ మేరకు ఓ అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసిన పాక్ ప్రభుత్వం.. మసూద్పై తగు చర్యలు తీసుకుంటున్నామని […]
జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో అతడిపై చర్యలకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. నిబంధనల ప్రకారం అజార్ ఆస్తులను జప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాకుండా అతడు ఎలాంటి ఆయుధాల కొనుగోలు, విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. అలాగే మసూద్ విదేశీ ప్రయాణాలపైనా.. పాక్ నిషేధం విధించింది. ఈ మేరకు ఓ అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసిన పాక్ ప్రభుత్వం.. మసూద్పై తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. కాగా మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న డిమాండ్కు ఐరాస భద్రతామండలిలోని అన్ని దేశాలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.