గంటన్నర సేపు ప్రసంగం.. అయినా పాక్ ఊసేదీ..?
73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. మొత్తం 92నిమిషాల పాటు మోదీ ప్రసంగం సాగగా.. పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా దేశంలో ఉన్న నీటి సమస్య, పేదరికం, జనాభా పెరుగుదల, ఉగ్రవాదం అంశాలపై మాట్లాడిన మోదీ.. వాటి పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తన ప్రసంగంలో మోదీ ఒక్కసారి కూడా పాకిస్తాన్ పేరు ఎత్తకపోవడం విశేషం. జమ్ముకశ్మీర్కు సంబంధించి రాజ్యాంగంలో […]
73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. మొత్తం 92నిమిషాల పాటు మోదీ ప్రసంగం సాగగా.. పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా దేశంలో ఉన్న నీటి సమస్య, పేదరికం, జనాభా పెరుగుదల, ఉగ్రవాదం అంశాలపై మాట్లాడిన మోదీ.. వాటి పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తన ప్రసంగంలో మోదీ ఒక్కసారి కూడా పాకిస్తాన్ పేరు ఎత్తకపోవడం విశేషం.
జమ్ముకశ్మీర్కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ఇటీవల మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇన్ని రోజులు కశ్మీర్ అడ్డాగా పలు విధ్వంసాలకు పాల్పడిన ఆ దేశ ఉగ్రవాదుల ఆటలకు ఈ ఆర్టికల్ రద్దు చెంపపెట్టు పెట్టినట్లైంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై సమయం చిక్కినప్పుడల్లా విమర్శిస్తూ వస్తున్నారు పాక్ అధికారులు. ఇక పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం మాట్లాడిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం.. తన ప్రసంగంలో పలుమార్లు కశ్మీర్ సమస్య గురించే ప్రస్తావించాడు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల భవిష్యత్లో పర్యవసానాలు తప్పవంటూ హెచ్చరించాడు. అయినా వీటన్నింటిపైన ఏ మాత్రం మోదీ ఒక్కసారి కూడా స్పందించకపోవడం విడ్డూరం. పదే పదే పాకిస్తాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ.. మోదీ మాత్రం మౌనం వహించడంలోని ఆంతర్యం అంతుపట్టడం లేదన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.