పాకిస్తాన్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో రూపంలో అంటుకుంటోంది. పాకిస్తాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగుతున్నాయి. కొత్తగా శనివారం ఒక్కరోజే 1743 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో పాకిస్థాన్లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,437కు చేరింది. ఈ మొత్తం కేసులలో అత్యధికంగా సింధ్లో 20,883, పంజాబ్లో 18,730, ఖైబర్ పక్తుంఖ్వాలో 7,391, బలూచిస్థాన్లో 3,198, ఇస్లామాబాద్లో […]
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో రూపంలో అంటుకుంటోంది. పాకిస్తాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగుతున్నాయి. కొత్తగా శనివారం ఒక్కరోజే 1743 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో పాకిస్థాన్లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,437కు చేరింది. ఈ మొత్తం కేసులలో అత్యధికంగా సింధ్లో 20,883, పంజాబ్లో 18,730, ఖైబర్ పక్తుంఖ్వాలో 7,391, బలూచిస్థాన్లో 3,198, ఇస్లామాబాద్లో 1457, గిల్గిత్ బాల్టిస్థాన్లో 607, పీఓకేలో 171 కేసులు నమోదయ్యాయి. వారిలో 16,653 మంది డిశ్చార్జి కాగా, 1101 మంది మృతిచెందారు. మిగిలిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో రంజాన్ పురస్కరించుకుని లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరగడంపట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.