టెర్రర్ ఫ్రీగా సౌత్‌ కశ్మీర్.. 94 మంది ఉగ్రవాదులు హతం..

దక్షిణ కశ్మీర్‌ ఉగ్రవాద రహిత ప్రాంతంగా అవతరించిందని జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులందర్నీ ఏరి వేశామని.. ఇప్పుడు నార్త్ కశ్మీర్‌ టార్గెట్‌ అని ప్రకటించారు.

టెర్రర్ ఫ్రీగా సౌత్‌ కశ్మీర్.. 94 మంది ఉగ్రవాదులు హతం..
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2020 | 9:59 PM

దక్షిణ కశ్మీర్‌ ఉగ్రవాద రహిత ప్రాంతంగా అవతరించిందని జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులందర్నీ ఏరి వేశామని.. ఇప్పుడు నార్త్ కశ్మీర్‌ టార్గెట్‌ అని ప్రకటించారు. కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ మంగళ వారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించి.. వివరాలు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో.. మొత్తం 94 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు చెప్పారు. దీంతో దక్షిణ కశ్మీర్‌లో దాదాపు ఉగ్రవాదులంతా అంతమయ్యారని.. ఇక ఇప్పుడు నార్త్ కశ్మీర్‌పై గురి పెడుతున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది 25 ఏకే-47 రైఫిల్స్‌తో పాటు.. పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇటీవల కశ్మీర్ పండిట్‌ సర్పంచ్‌ను చంపింది హిజ్బుల్ ఉగ్రవాదిగా గుర్తించామని.. అతడి పేరు ఉమర్ అని తెలిసిందన్నారు. అతడితో పాటు మరో ఉగ్రవాది కూడా సర్పంచ్‌ హత్యలో పాల్గొన్నాడని తేలిందని.. వీరు ఇటీవలే హిజ్బుల్‌ ఉగ్రసంస్థలో చేరారన్నారు. త్వరలోనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని ఐజీ స్పష్టం చేశారు. అంతేకాదు.. ఇటీవల ఉగ్రసంస్థలకు హవాలా మార్గంలో డబ్బులను అందజేస్తున్న డ్రగ్స్‌ ముఠాను కూడా పట్టుకున్నామని తెలిపారు.