గువాహటి జైలులో 44 శాతం మంది ఖైదీలకు కరోనా..
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అసోం లోని గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఈ జైలులో ఉన్న ఖైదీల్లో 44శాతం మందికి
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అసోం లోని గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఈ జైలులో ఉన్న ఖైదీల్లో 44శాతం మందికి కరోనా సోకడం సంచలనం రేపింది. జైలులో ఉన్న రైతు నాయకుడు అఖిల్ గొగోయ్, స్టూడెంట్ యాక్టివిస్టు షర్జీల్ ఇమాంలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారితోపాటు ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలని అసోం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ముగ్గురు ఖైదీలు సోనాపూర్ సివిల్ హాస్పిటల్ నుండి తప్పించుకున్న తరువాత జైలు లోపల సీసీటీవీ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా ప్రభావితమైన గువహతి సెంట్రల్ జైలులో ప్రస్తుతం 435 మంది ఖైదీలకు, మిగతా 10 జైళల్లో 535 మందికి కరోనా సోకిందని అసోం జైళ్ల శాఖ ఇన్ స్పెక్టరు జనరల్ దశరథదాస్ చెప్పారు. దీంతో తాము గువాహటి జైలులో 200 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశామని జైలు అధికారులు చెప్పారు. అసింప్టమాటిక్ కరోనా రోగులను నాగామ్ ప్రత్యేక జైలులో ఉంచాలని నిర్ణయించినట్లు జైళ్ల శాఖ అధికారులు వివరించారు. జైళ్లలోని ఖైదీలందరికీ కరోనా పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు.