పాక్పై గెలవాలని మనవాళ్లకు తెలుసు- సునీల్ గవాస్కర్
ముంబయి: ప్రపంచకప్లో పాకిస్థాన్తో తలపడే హోరాహోరీ మ్యాచ్లో టీమిండియాపై అదనపు ఒత్తిడేమీ ఉండదని మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అన్నారు. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలిచి తీరాలని వారికి తెలుసని పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో టీమిండియా మ్యాచ్ ఆడొద్దని డిమాండ్లు వచ్చాయి. ప్రస్తుతానికి మ్యాచ్ బహిష్కరించే పరిస్థితులు కనిపించడం లేదు. ‘ఆటగాళ్లు అదనపు ఒత్తిడికి లోనవుతారని అనుకోను. ఈ క్రికెట్ మ్యాచ్ గెలిచి తీరాలని వారికి తెలుసు. ఆ పరిణతి వారికి ఉంది. వారు పరిస్థితులకు దూరంగా […]
ముంబయి: ప్రపంచకప్లో పాకిస్థాన్తో తలపడే హోరాహోరీ మ్యాచ్లో టీమిండియాపై అదనపు ఒత్తిడేమీ ఉండదని మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అన్నారు. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలిచి తీరాలని వారికి తెలుసని పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో టీమిండియా మ్యాచ్ ఆడొద్దని డిమాండ్లు వచ్చాయి. ప్రస్తుతానికి మ్యాచ్ బహిష్కరించే పరిస్థితులు కనిపించడం లేదు.
‘ఆటగాళ్లు అదనపు ఒత్తిడికి లోనవుతారని అనుకోను. ఈ క్రికెట్ మ్యాచ్ గెలిచి తీరాలని వారికి తెలుసు. ఆ పరిణతి వారికి ఉంది. వారు పరిస్థితులకు దూరంగా ఏమీ ఉండరు. అయితే గొప్ప జట్లు తమ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోవు. ఆటపైనే దృష్టి పెడతాయి. ఒక బ్యాట్స్మన్గా అంతకు ముందు బంతికి ఏం జరిగిందో మరిచిపోవాలి. తర్వాతి బంతిపై శ్రద్ధ పెట్టాలి. జట్టుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది’ అని గావాస్కర్ అన్నారు.