జులైలో ఓయూ డిగ్రీ, పీజీ పరీక్షలు..!
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో వాయిదా పడ్డ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను జులై ఫస్ట్ వీక్ లో నిర్వహించాలని ఓయూ స్టాండింగ్ కమిటీ తీర్మానించింది.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో వాయిదా పడ్డ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను జులై ఫస్ట్ వీక్ లో నిర్వహించాలని ఓయూ స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. జూన్ 20 నుంచి ఎగ్జామ్స్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున జులై ఫస్ట్ వీక్ లో డిగ్రీ, జులై 15 నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అప్పటికి కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తేనే పరీక్షలు పెట్టాలని లేకుంటే మరోసారి మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని సభ్యులు సూచించారు.
పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్ చేసి.. భౌతిక దూరం పాటించేలా బెంచ్కు ఒక విద్యార్థి ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. పరీక్ష సమయం 3 నుంచి 2 గంటలకు తగ్గించినట్లు ఓయూ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి ఆదివారం చెప్పారు. ఈ మేరకు ప్రశ్నాపత్రంలోనూ మార్పులు ఉంటాయన్నారు. బ్యాక్లాగ్స్ ఉన్నవారిని డిటెండ్ చేయకుండా ముందు తరగతులకు ప్రమోట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. స్టాండింగ్ కమిటీ తీర్మానాలను గవర్నమెంట్ కు, ఉన్నత విద్యా మండలికి పంపుతామని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్నారు.